విశాఖలో భూసమీకరణ

విశాఖలో పెద్దయెత్తున భూ సమీకరణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబరు 72 విడుదల చేసింది. విశాఖపట్నం జిల్లాలోని పది మండలాల్లో ఆరు [more]

Update: 2020-01-28 12:43 GMT

విశాఖలో పెద్దయెత్తున భూ సమీకరణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబరు 72 విడుదల చేసింది. విశాఖపట్నం జిల్లాలోని పది మండలాల్లో ఆరు వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సేకరించిన భూమిని విశాఖ మెట్రో డెవెలెప్ మెంట్ అధారిటీకి అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ భూసమీకరణ ఎగ్జిక్యూటివ్ క్యాపిట్ కోసమేనన్న ప్రచారం జరుగుతుంది. కానీ అధికారులు మాత్రం అర్బన్ హౌసింగ్ కోసమేనని చెబుతుండటం విశేషం.

Tags:    

Similar News