Andhra pradesh : ఆ నీటిని కూడా వారి వాటాలో వేయండి

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. కృష్ణా జలాల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని కోరింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల వద్ద విద్యుత్తు [more]

Update: 2021-09-23 07:00 GMT

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. కృష్ణా జలాల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని కోరింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల వద్ద విద్యుత్తు ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని, దీనికి వినియోగించిన నీటిని తెలంగాణ నీటి వాటాలోనే వేయాలని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం 113 టీఎంసీల నీటిని వాడుతుందని, దీనిని ఆ రాష్ట్ర వాటాలోనే వేయాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న తెలంగాన ప్రభుత్వానికి జరిమానా కూడా విధించాలని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో కోరారు.

Tags:    

Similar News