రాజీ పడే ప్రసక్తి లేదన్న ఏపీ సర్కార్

కృష్ణా జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఈఎన్ సీ లేఖ [more]

Update: 2020-08-26 13:02 GMT

కృష్ణా జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఈఎన్ సీ లేఖ రాశారు. ఏపీ విష‍యంలో కేఆర్ఎంబీ వివక్ష చూపుతుందన్నారు. తాము పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం వరద నీటిని .5 టీఎంసీ లను వాడుకుంటే అభ్యంతరం చెప్పిన బోర్డు, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అభ్యంతరాలను మాత్రం ఏపీ గోరంతలు కొండతలు చేసి చూపుతుందని ఏపీ నీటిపారుదల శాఖ ఈఎన్ సి బోర్డకు ఘాటు లేఖ రాశారు.

Tags:    

Similar News