కర్ణాటకలో వివాదం రాజేసిన ఏపీ కాంగ్రెస్ నేత

Update: 2018-06-19 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కర్ణాటక పర్యటన ఆ రాష్ట్రంలో వివాదం రాజేసింది. ఆయన ఇటీవల తమకూరు జిల్లా పావగడ తాలూకా పంచాయితీ సమావేశంలో పాల్గొన్నారు. అంతే కాదు, కర్ణాటక కార్మిక శాఖ మంత్రి ఎం.వెంకటరమణప్ప సమక్షంలోనే అక్కడ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఆయన ఏ హోదాలో అధికారులతో సమావేశమయ్యారని కన్నడ టీవీ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. పలువురు కాంగ్రెస్ పార్టీ, సదరు మంత్రి, రఘువీరారెడ్డిపై మండిపడ్డారు. అయితే, ఈ విషయంపై స్పందించిన మంత్రి వెంకటరమణప్ప..తాను ఆహ్వానించినందునే రఘువీరా వచ్చారని, మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డిని కొంతసేపు తెలుగులో మాట్లాడమని తాను కోరినందునే మాట్లాడారని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయమేమీ లేదని మీడియాకు వివరించారు.

Similar News