పవన్ కల్యాణ్ ను కలసిన సోము వీర్రాజు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించుకున్నారు. జనసేన, బీజేపీలు ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న [more]

Update: 2020-08-07 06:49 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించుకున్నారు. జనసేన, బీజేపీలు ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చేయాల్సిన పోరాటాలపై వారిరువురూ చర్చించినట్లు తెలిసింది. ఏపీలో ఇళ్ల స్థలాలు, గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయింపు తదితర అంశాలపై ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత పలువురు నేతలను కలసి మద్దతు కోరుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News