ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మ‌రో షాక్‌

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఖ‌మ్మం జిల్లా ఎమ్మెల్యేలు హ‌రిప్రియా నాయ‌క్‌, రేగా కాంతారావును [more]

Update: 2019-05-07 11:41 GMT

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఖ‌మ్మం జిల్లా ఎమ్మెల్యేలు హ‌రిప్రియా నాయ‌క్‌, రేగా కాంతారావును పార్టీ ఫిరాయింపున‌కు నిర‌స‌న‌గా ప్ర‌జ‌లు అడ్డుకొని దాడి చేసినంత ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసి గెలిచి, పార్టీని, ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోసం చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై మ‌నుగోరు పోలీస్ స్టేష‌న్ లో ఎమ్మెల్యే రేగా కాంతారావుపై, కొత్తగూడెం వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ లో వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసు న‌మోదైంది.

Tags:    

Similar News