పుదుచ్చేరిలో కాంగ్రెస్ కు మరో షాక్

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రాజీనామా లేఖను పంపారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లయింది. నేడు [more]

Update: 2021-02-22 01:18 GMT

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రాజీనామా లేఖను పంపారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లయింది. నేడు పుదుచ్చేరిలో నారాయణస్వామి బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ సమయంలో మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 9కి పడిపోయింది. దీంతో నారాయణస్వామి ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. బలపరీక్షకు వెళ్లకుండా నారాయణస్వామి తన మంత్రివర్గంతో రాజీనామా చేయడానికి అవకాశాలున్నాయి.

Tags:    

Similar News