నెల తక్కువ ఉమా…మంగలిని పంపిస్తా సిద్ధంగా ఉండు

మాజీ మంత్రి దేవినేని ఉమపై ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. దేవినేని ఉమ అన్నీ అబద్ధాలు చెబుతున్నారన్నారు. నెల తక్కువ ఉమ పేపర్ తీసుకువచ్చి [more]

Update: 2020-05-16 12:38 GMT

మాజీ మంత్రి దేవినేని ఉమపై ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. దేవినేని ఉమ అన్నీ అబద్ధాలు చెబుతున్నారన్నారు. నెల తక్కువ ఉమ పేపర్ తీసుకువచ్చి ఏదో చెబుతున్నారన్నారు. పోలవరం పనులు 70 శాతం పనులు పూర్తయ్యారంటున్నారన్నారు. మంగలిని పంపిస్తా గొరిగించుకోవడానికి సిద్ధమేనా? అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. 48 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు వ్యయం అయితే 16 వేల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయినట్లా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంటే కేవలం డ్యామ్ కాదని, పునరావాసం కూడా ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పునరావాసంలో ఒక్క ఎస్టీకి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు.

Tags:    

Similar News