ఆంధ్రజ్యోతి సర్వే అబద్ధమే..?

తెలుగుదేశం పార్టీదే అధికారం అంటూ ఇవాళ టీడీపీ అనుకూల ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన సర్వే అబద్ధమని తేలింది. లోక్ నీతి – సీఎస్డీఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో [more]

Update: 2019-04-01 07:25 GMT

తెలుగుదేశం పార్టీదే అధికారం అంటూ ఇవాళ టీడీపీ అనుకూల ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన సర్వే అబద్ధమని తేలింది. లోక్ నీతి – సీఎస్డీఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీడీపీ విజయం సాధిస్తుందని 126 నుంచి 135 సీట్లు వస్తాయని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో కథనం ప్రచురించింది. వైసీపీకి కేవలం 45-50 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే అంచనా వేసినట్లుగా రాసింది. మార్చి 11 నుంచి 19 వరకు ఈ సర్వే జరిగినట్లుగా చెప్పింది. అయితే, ఈ సర్వేను సదరు లోక్ నీతి – సీఎస్డీఎస్ సంస్థ ఖండించింది. అసలు ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థ ఎటువంటి సర్వే చేయలేదని, సర్వే జరిపినట్లుగా వస్తున్న వార్తలన్నీ తప్పని స్పష్టం చేసింది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త తప్పని, ఆ పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధి తెలిపారు. మొత్తానికి ఒక ప్రధాన పత్రిక ఎన్నికల వేళ ఇలా అబద్ధపు సర్వే పేరుతో ఒక పార్టీకి అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేయడానికి వార్త రాయడాన్ని అంతా తప్పుపడుతున్నారు.

Tags:    

Similar News