వైసీపీ ఊహించని విధంగా....?

Update: 2018-07-24 06:01 GMT

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం అవుతోంది. అన్ని జిల్లాల్లో మంగళవారం తెల్లవారు జామున నుంచే వైసీపీ నేతలు బస్టాండ్ లు, బస్ డిపోల వద్ద ధర్నా నిర్వహించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అన్ని ప్రాంతాల్లో దుకాణదారులు, విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించారు. దీంతో బంద్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనసడుతోంది.

ప్రభుత్వం ఉక్కుపాదం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను మొహరించి బంద్ ను విఫలం చేసేందుకు ప్రయత్నించింది. ఎక్కడిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేయించారు. పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల అరెస్ట్ లను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. ఇక ఏపీ పలువురు మంత్రులు బంద్ విఫలమైందని ప్రకటించారు.

Similar News