ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఆయనను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసినట్లు సమాచారం. ఆయన స్థానంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా [more]

Update: 2020-12-15 10:51 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఆయనను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసినట్లు సమాచారం. ఆయన స్థానంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరుణ్ కుమార్ గోస్వామిని నియమించనున్నారని తెలిసింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ జరుగుతుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఏపీ చీఫ్ జస్టిస్ తో పాటు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ ను కూడా బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కొలీజియం నిర్ణయించిందని చెబుతున్నారు. మరికొద్దిసేపట్లోదీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News