నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన [more]

Update: 2020-11-27 02:04 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే నివర్ తుపాను ప్రభావం మీద కూడా మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. అలాగే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అంశాలను మంత్రులకు జగన్ వివరించనున్నారు.

Tags:    

Similar News