ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. నష్టపోయిన రైతులకు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా భారీ వర్షాలు, నివార్ తుపానుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నలభైవేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని ప్రాధమిక అంచనా [more]

Update: 2020-11-27 08:15 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా భారీ వర్షాలు, నివార్ తుపానుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నలభైవేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని ప్రాధమిక అంచనా వేశారు. వచ్చే నెల పదిహేనులోగా అంచనాను పూర్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జనవరి లోగా పరిహారం అందరికీ అందేలా చూడాలని అభిప్రాయపడింది. తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం అందించాలని మంత్రివర్గం సమావేశం నిర్ణయించింది. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News