ఇక అన్నీ అమూల్ కే

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన డెయిరీ డెవలెప్ [more]

Update: 2021-05-05 01:10 GMT

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన డెయిరీ డెవలెప్ మెంట్ సంస్థకు చెందిన ఆస్తులన్నీ అమూల్ సంస్థకు లీజుకివ్వాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నాటికి అన్ని గ్రామాల్లో అమూల్ ను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు దేవాలయాల్లో అర్చకుకులకు గౌరవ వేతనం పది నుంచి పదిహేను వేల రూపాయలకు, బికేటగిరి దేవాలయల్లో ఐదు నుంచి పదివేల రూపాయలకు పెంచుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇమామ్ లకు ఐదు నుంచి పదవివేలు, మౌజమ్ లకు మూడు నుంచి ఐదు వేల రూపాయలకు పెంచడానికి మంత్రి వర్గ సమావేశం ఆమోదం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News