జగన్ క్యాబినెట్ విస్తరణ అప్పుడే..?

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 8వ తేదీన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. సచివాలయం పక్కన ఉన్న స్థలంలో ఆ రోజు ఉదయం 9.15 [more]

Update: 2019-05-31 12:43 GMT

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 8వ తేదీన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. సచివాలయం పక్కన ఉన్న స్థలంలో ఆ రోజు ఉదయం 9.15 గంటలకు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు ఉదయం జగన్ సచివాలయంలో మొదటిసారి అడుగుపెట్టనున్నారు. ఉదయం 8.42 గంటలకు సచివాలయంలో జగన్ పూజలు నిర్వహించనున్నారు. 8.50 గంటలకు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. 9.10 గంటలకు సచివాలయ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం అదే రోజు క్యాబినెట్ భేటీ జరగనునుంది.

Tags:    

Similar News