జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కూడా హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమయిన వెంటనే నిన్న సున్నా వడ్డీ రుణాలపై సభకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు [more]

Update: 2019-07-12 03:48 GMT

బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కూడా హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమయిన వెంటనే నిన్న సున్నా వడ్డీ రుణాలపై సభకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ స్పీకర్ కు సీఎంపై సభాహక్కుల నోటీసును ఇచ్చింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి నిన్న చేసిన వ్యాఖ్యలకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి చర్చను కొనసాగించాలని స్పీకర్ ను కోరారు. టీడీపీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కరవు పై ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత సభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలన్నారు. దీనికి వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తిరిగి నిన్నటి చర్చకు కొనసాగింపుగా నిమ్మల రామానాయుడు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

Tags:    

Similar News