లోకేష్ అవినీతిపై సీబీఐ…?

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని మాజీ టీడీపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. [more]

Update: 2019-07-19 11:49 GMT

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని మాజీ టీడీపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా అవినీతికి పాల్పడ్డారని, గత ప్రభుత్వ హయాంలో ఐటి శాఖలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని అన్నం సతీష్ ప్రభాకర్ కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కూడా త్వరలో కలవనున్నట్లు ఆయన తెలిపారు. నారా లోకేష్ వల్లనే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిందని అన్నం సతీష్ ప్రభాకర్ తెలిపారు. లోకేష్ వల్లనే అనేకమంది టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నారని తెలిపారు.

Tags:    

Similar News