రాజధాని తరలింపు ఇప్పుడు కాదు..అవన్నీ ఊహాగానాలేే

రాజధాని తరలింపు జరుగుతోందని అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాజధాని తరలింపు అంశం బిల్లులు [more]

Update: 2020-05-11 14:00 GMT

రాజధాని తరలింపు జరుగుతోందని అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాజధాని తరలింపు అంశం బిల్లులు చట్టసభల్లో పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. బిల్లు ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎదురు చూస్తుందని తెలిపారు. సచివాలయాన్ని ఈ నెల 28వ తేదీన తరలిస్తున్నారన్న పిటీషర్ ఆలోచనలు ఊహాగానాలేనని ప్రభుత్వం తన కౌంటర్ లో పేర్కొంది. చట్టాన్ని అనుసరించే ప్రభుత్వం ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ఈ పిటీషన్ ఏపీ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News