మళ్లీ ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఆసుపత్రిలో చేరారు. అమిత్ షా తిరిగి అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే అమిత్ షా [more]

Update: 2020-09-13 02:28 GMT

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఆసుపత్రిలో చేరారు. అమిత్ షా తిరిగి అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే అమిత్ షా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో రెండోసారి ఆసుపత్రిలో చేరి డిశ్చార్జి అయ్యారు. కోలుకుని తిరిగి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్న అమిత్ షా మరోసారి అనారోగ్యం పాలవ్వడంతో ఎయిమ్స్ లో చేరారు. ఆయన కార్డియో న్యూరోర టవర్ లో అడ్మిట్ అయ్యారు.

Tags:    

Similar News