అందుకు 24 గంటలు ఎందుకు రాహుల్..!

Update: 2018-08-30 13:23 GMT

రాఫెల్ డీల్ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని, 24 గంటల్లో స్పందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ ను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తిప్పికొట్టారు. 24 గంటలు ఎందుకు... ఇప్పటికే జూతీ పార్టీ కాంగ్రెస్(జేపీసీ) ఉంది కదా అని ఎద్దేవా చేశారు. స్వార్థం కోసం రాఫెల్ డీల్ పై ఆరోపణలు చేస్తున్నారని, ఢిల్లీలో, కర్ణాటకలో, రాయ్ పూర్ లో, హైదరాబాద్ లో, జైపూర్ లో, పార్లమెంటు లో ఒక్కోచోట ఒక్కోలా రాహుల్ మాట్లాడుతున్నారని, ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. రాహుల్ గాంధీ జ్ఞాపకశక్తి కంటే దేశ ప్రజలు జ్ఞాపకశక్తి ఎక్కువ అని ఎద్దేవా చేశారు.

 

Similar News