మరికాసేపట్లో ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు భారత్ కు రానున్నారు. ఈరోజు ఉదయం 11.45 నిమిషాలకు ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రధాని [more]

Update: 2020-02-24 01:42 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు భారత్ కు రానున్నారు. ఈరోజు ఉదయం 11.45 నిమిషాలకు ట్రంప్ నేరుగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోదీతో కలసి రోడ్ షో లో పాల్గొంటారు. దాదాపు 22 కి.మీ మేర రోడ్ షో ఉండనుంది. అనంతరం మొతేరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ట్రంప్ దంపతులు ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శిస్తారు. ఆగ్రానుంచి తిరిగి ఢిల్లీ వచ్చి మౌర్య షెరటాన్ హోటల్ లో బస చేస్తారు. ట్రంప్ రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి ఇప్పటికే అమెరికా భద్రతాదళాలు ట్రంప్ పర్యటించే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి. ట్రంప్ వెంట ఆయన సతీమణి మెలానియా, కూతురు ఇవాంకా ట్రంప్, ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ కూడా భారత్ పర్యటనకు వస్తున్నారు.

Tags:    

Similar News