నేడు సోనియా తో కెప్టెన్ భేటీ

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేడు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలవనున్నారు. ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతకొంత కాలంగా పంజాబ్ కాంగ్రెస్ లో [more]

Update: 2021-07-06 03:21 GMT

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేడు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలవనున్నారు. ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతకొంత కాలంగా పంజాబ్ కాంగ్రెస్ లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఏర్పడ్డాయి. సిద్ధూ ఇటీవల ప్రియాంక, రాహుల్ గాంధీని కలిశారు. నేడు అమరీందర్ సింగ్ సోనియాను కలవనున్నారు. ఇద్దరి మధ్య వివాదానికి ఈ సమావేశం చెక్ పెడుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News