చిన్న చిన్న కేసులకు సీబీఐ దర్యాప్తా?

డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చిన్న కేసులకూ సీబీఐ దర్యాప్తు చేసుకుంటూ పోతే [more]

Update: 2020-05-23 07:39 GMT

డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చిన్న కేసులకూ సీబీఐ దర్యాప్తు చేసుకుంటూ పోతే ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అది ఒక పెట్టీ కేసుగా ఆమంచి కొట్టిపారేశారు. ఇలాంటి తీర్పుల వల్ల న్యాయస్థానాల మీదనే నమ్మకం పోతుందని ఆమంచి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ లేకుంటే తాను హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేవాడినన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో రాష్ట్రం మొత్తం ఆశ్చర్య పోయిందన్నారు.

Tags:    

Similar News