బ్రేకింగ్ : అంబటి రాయుడు సూపర్బ్ సెంచరీ

Update: 2018-10-29 11:42 GMT

హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు ముంబైలో చెలరేగిపోయాడు. కేవలం ఎనభై పరుగుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. వెస్ట్ ఇండీస్- ఇండియా నాలుగో వన్డే ముంబయిలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్, కోహ్లి అవుట్ కావడంతో రోహిత్, అంబటి రాయుడు భాగస్వామ్యం భారీ స్కోరు నమోదు చేసింది. రోహిత్ శర్మ 162 పరుగులు చేసి ఔటయ్యారు. భారత్ భారీ స్కోర్ దిశగా పరుగులు చేస్తోంది. భారత్ ప్రస్తుతం 347 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అంబటిరాయుడు సెంచరీ చేసి రన్ అవుట్ అయ్యారు.

Similar News