సీబీఐ కొత్త డైరెక్టర్ పై ఆరోపణలు

Update: 2018-10-24 10:02 GMT

సీబీఐ కి ఇంఛార్జి డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి, ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావును నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. నాగేశ్వరరావుపై ఇంతకుముందు అనేక అవినీతి రోపణలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఆరోపించారు. ప్రధాని మోదీ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను సీబీఐలో కీలక పదవుల్లో నియమిస్తూ సీబీఐను బ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ఒడిశాలో పనిచేసిన సమయంలో నాగేశ్వరరావు పలు అక్రమాలకు పాల్పడ్డారని మొయిలీ ఆరోపణలు చేశారు.

Similar News