అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణలను తొలగించాల్సి వస్తే పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లను కూడా తొలగించాలని కోరారు. గత ఎన్నికల సమయంలో [more]

Update: 2020-11-25 07:45 GMT

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణలను తొలగించాల్సి వస్తే పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లను కూడా తొలగించాలని కోరారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా టీఆర్ఎస్ అమలు చేయలేదన్నారు. అందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. హైదరాబాద్ లో ఆక్రమణలను తొలగిస్తామని ప్రభుత్వం చెబుతోందని, 4,700 ఎకరాలు ఉంటే హుస్సేన్ సాగర్ 700 ఎకరాలు మిగిలిందన్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా కత్తిరించాలో తమకు తెలుసునని అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చేదు అనుభవం….

కాగా అక్బరుద్దీన్ కు చేదు అనుభవం ఎదురయింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన అక్బరుద్దీన్ ను స్థానికులు అడ్డుకున్నారు. భోలక్ పూర్ డివిజన్ లో అక్బరుద్దీన్ ప్రసంగిస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. తమకు రాజకీయాలు అవసరం లేదని అభివృద్ధి కావాలని వారు నినాదాలు చేశారు. దీంతో అక్బరుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News