రైతులను ఆదుకునేందుకే ప్రత్యేకంగా?

29, 187 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రైతులను [more]

Update: 2020-06-16 12:02 GMT

29, 187 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. అన్నదాతకు అండగా నిలుస్తుందని కన్న బాబు చెప్పరాు. రాయితీ విత్తనాల కోసం 200 కోట్లు కేటయాచించామన్నారు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి 4,450 కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయ యాంత్రికీకరణకు 207 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. పశు సంవర్థక శాఖకు 857 కోట్లు కేటాయించారు. ధరల స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్లు కేటాయించామని చెప్పారు. వైఎస్సార్ ఉద్యానవన వర్సిటీకి 88 కోట్లు ఇచ్చారు. రైతు బంధు పథకానికి 14 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.

Tags:    

Similar News