ఊహించని మలుపు తిరిగిన సెలక్ట్ కమిటీ

సెలెక్ట్ కమిటీ వ్యవహారం ఇంకా తుది దశకు చేరుకోలేదు. జనవరి 26 వతేదీన సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మన్ తెలిపారు. అయితే ఇంతవరకూ సెలెక్ట్ [more]

Update: 2020-02-10 13:39 GMT

సెలెక్ట్ కమిటీ వ్యవహారం ఇంకా తుది దశకు చేరుకోలేదు. జనవరి 26 వతేదీన సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మన్ తెలిపారు. అయితే ఇంతవరకూ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు. రెండు కీలక బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని శాసనమండలి సెక్రటరి ఛైర్మన్ కు లేఖ రాయడం సంచలనమయింది. శాసనమండలి ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సెక్రటరీ లేఖలో పేర్కొన్నారు. దీంతో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని తేలిపోయింది. దీనిపై తాము శాసనమండలి సెక్రటరీ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. శాసనమండలి ఛైర్మన్ ను ప్రభుత్వం బెదిరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News