కరోనాను ఎలా మేనేజ్ చేస్తారు?

వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్న విజయసాయి రెడ్డి కరోనాను ఎలా మేనేజ్ చేస్తారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కోర్టు లు తప్పుపడుతున్నా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు. [more]

Update: 2020-03-18 07:58 GMT

వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తున్న విజయసాయి రెడ్డి కరోనాను ఎలా మేనేజ్ చేస్తారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కోర్టు లు తప్పుపడుతున్నా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతుంటే ఎన్నికలు జరిపించాలని కోర్టుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. కొన్ని చోట్ల ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరుతున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసి తిరిగి షెడ్యూల్ విడుదల చేయాలని ఆయన కోరారు. ఈరోజు తాము ఎన్నికల కమిషనర్ ను కోరుతున్నట్లు ఆయన చెప్పారు.

Tags:    

Similar News