బ్రేకింగ్‌: క‌ర్నూలు జిల్లాలో ఘోర ప్ర‌మాదం

క‌ర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్, తుఫాన్ వాహ‌నం, ఓ బైక్ ఢీ కొని 15 మంది మృతి చెందారు. [more]

Update: 2019-05-11 13:12 GMT

క‌ర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్, తుఫాన్ వాహ‌నం, ఓ బైక్ ఢీ కొని 15 మంది మృతి చెందారు. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతులు గ‌ద్వాల జిల్లా శాంతిన‌గ‌ర్ మండ‌లం రామాపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. గాయ‌ప‌డ్డ వారికి స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించి అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు భావిస్తున్నారు. హైద‌రాబాద్ నుంచి క‌ర్ణాట‌క‌లోని మ‌ణిపాల్ వెళ్తున్న బ‌స్సు వెల్దుర్తి క్రాస్ వ‌ద్ద బైక్ ను త‌ప్పించ‌బోయి తుఫాన్ వాహ‌నాన్ని ఢీకొట్టింది. తుఫాన్ లో ఉన్న వారు ఎక్కువ‌గా మ‌ర‌ణించారు. వీరంతా పెళ్లి చూపుల కోసం వెళ్లి వ‌స్తున్నట్లు స‌మాచారం.

Tags:    

Similar News