మాజీ మంత్రి కుమారుడి కోసం పోలీసులు

మాజీ మంత్రి కుమారుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ప్రమేయం ఉందని ఏసీబీ గుర్తించింది. అయితే ఈరోజు [more]

Update: 2020-07-10 14:01 GMT

మాజీ మంత్రి కుమారుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ప్రమేయం ఉందని ఏసీబీ గుర్తించింది. అయితే ఈరోజు ఉదయం పితాని సత్యనారాయణ వద్ద పీఏగా పనిచేసిన మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సురేష్ ఇప్పటికే తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. పితాని కుమారుడు సురేష్ హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయన కోసం ఏసీబీ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుంది. ఏ క్షణంలోనైనా పితాని సురేష్ ను అరెస్ట్ చేసే అవకాశముంది.

Tags:    

Similar News