Egg : ఉడకబెట్టిన గుడ్డు.. ప్రాణం మింగేసింది

ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో ఎవరికీ తెలియదు. కర్రే పామై కరుస్తుందన్న సామెతను పెద్దోళ్లు ఊరికే చెప్పలేదు. ఒక్కోసారి కూర్చున్న చోటే ప్రాణం వదలేసే వారు కూడా [more]

Update: 2021-10-14 07:30 GMT

ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో ఎవరికీ తెలియదు. కర్రే పామై కరుస్తుందన్న సామెతను పెద్దోళ్లు ఊరికే చెప్పలేదు. ఒక్కోసారి కూర్చున్న చోటే ప్రాణం వదలేసే వారు కూడా ఎందరో ఉన్నారు. మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఇప్పుడు అలాంటి సంఘటనే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఒక మహిళ కోడిగుడ్డు తింటుండగా గొంతులో జారి అడ్డంపడి చనిపోయింది.

గొంతులో ఇరుక్కుని….

నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజీపేట మండలంలోని నేరెళ్లపల్లి గ్రామంలో నీలమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈమె భోజనం చేస్తున్న సమయంలో ఉడకబెట్టిన కోడిగుడ్డును కొరికే ప్రయత్నం చేసింది. అయితే గొంతులో నుంచి అది జారి పోయింది. గొంతుకు అడ్డంపడి ఊపిరి ఆడక నీలమ్మ ప్రాణం వదిలింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది.

Tags:    

Similar News