చిరంజీవి ఇంటి ముందు టెన్షన్ టెన్షన్

చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అమరావతి కి చెందిన రైతులు ఈరోజు చిరంజీవి ఇంటికి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పడంతో చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద [more]

Update: 2020-02-29 06:19 GMT

చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అమరావతి కి చెందిన రైతులు ఈరోజు చిరంజీవి ఇంటికి వచ్చి ఆందోళన చేస్తామని చెప్పడంతో చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు చిరంజీవి ఇంటి ముందు ఎలాంటి ఆందోళన చేయకూడదని చిరంజీవి ఫ్యాన్స్ అక్కడే వేల సంఖ్యలో ఉన్నారు. దీంతోపాటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును చిరంజీవి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. అమరావతి రైతులు తమిళనాడులో రైతుల కానీ ఎవరికైనా ఆపద వస్తే సినీ ప్రముఖులు సహాయం చేస్తారని, కానీ అమరావతి లో పెద్ద ఎత్తున జరుగుతున్న రైతుల సమస్యలను సినీ ప్రముఖులు ఎవరూ పట్టించుకోవడం లేదని అందుకే తాము చిరంజీవి ఇంటి ముందు ఆందోళన చేస్తామని అమరావతి జేఏసీ అంటోంది. ఈ విషయంపై పై రైతులు చిరంజీవి ఇంటికి చేరుకోకముందే పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News