నేడు పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం

పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. డెల్టాకు నీటిని అందించే ప్రక్రియను నేడు ప్రారంభించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా స్విల్ వే మీదుగా [more]

Update: 2021-06-11 03:47 GMT

పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. డెల్టాకు నీటిని అందించే ప్రక్రియను నేడు ప్రారంభించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా స్విల్ వే మీదుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించనున్నారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, రివర్స్ స్లూయిజ్ మీదుగా గోదావరి నీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టా ప్రాంతాలకు మళ్లించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి 6.6 కిలోమీటర్ల మేర ప్రవాహాన్ని మళ్లించి డెల్టాకు నీరందించనున్నారు. ఈకార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్, ఆళ్ల నాని పాల్గొననున్నారు.

Tags:    

Similar News