111 ఏళ్ల మఠాధిపతి కన్నుమూత

కర్ణాటక సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా [more]

Update: 2019-01-21 08:54 GMT

కర్ణాటక సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే ఉంచారు. ఆయనను బతికించేందుకు వైద్యుల బృందం తీవ్రంగా శ్రమించింది. స్వామి ఆరోగ్యం మెరుగవ్వాలని పీఠంలో ప్రత్యేక యాగం కూడా చేశారు. అయితే, ఈ ప్రయత్నాలేమీ ఫలించలేదు. కొంతసేపటి క్రితం ఆయన కన్నుమూశారు. శివకుమార స్వామి మృతికి కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ సీఎం యడ్యూరప్ప సంతాపం ప్రకటించారు. రేపు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. వీరశైవ లింగాయత్ ప్రజల్లో శివకుమార స్వామికి పెద్దఎత్తున భక్తులు ఉన్నారు. కన్నడ నాట పలువురు ప్రముఖ నాయకులు కూడా ఆయన భక్తులు.

Tags:    

Similar News