పీవీపీ పై కేసు నమోదు

వైసీపీ నేత, పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2022-01-19 02:13 GMT

వైసీపీ నేత, పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ గేటెడ్ కమ్యునిటిలోకి అక్రమంగా ప్రవేశించిన పీవీపీ అనుచరులు తమ కాంపాండ్ వాల్ ను కూల్చి వేశారని డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి చేసిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

డీకే అరుణ కుమార్తె....
గెటెడ్ కమ్యునిటీ లో ఉన్న శృతి రెడ్డికి చిందిన కాంపాండ్ వాల్ ను కూల్చడమే కాకుండా, గోడలపై ఉన్న రేకులను తొలగించేందుకు పీవీపీ అనుచరులు ప్రయత్నించారని శృతి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐపీసీ 447, 427,506,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ పీవీపీపై కేసు నమోదయింది.


Tags:    

Similar News