హైదరాబాద్ లో కలవరం.. గురుకుల పాఠశాలలో 25మందికి కరోనా

సంగారెడ్డి పటాన్ చెర్వులోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 25 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

Update: 2021-12-02 12:39 GMT

సంగారెడ్డి పటాన్ చెర్వులోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 25 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవలే తెలంగాణలోని మరొక గురుకుల పాఠశాలలోనూ విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

ప్రభుత్వం తక్షణ ఆదేశాలు..
కోవిడ్ నిబంధనలను పాటించకపోవడం, సక్రమంగా శానిటైజ్ చేసుకోకపోవడం వల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు చెబుతున్నారు. అధికారులకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గురుకుల పాఠశాలల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News