హీరో కన్నా హీరోయిన్ కే ఎక్కువ ప్రాధాన్యత..?

Update: 2018-02-21 16:27 GMT

సాయి ధరమ్ తేజ్ వరుస ఓటములతో బాధపడుతున్నాడు. వి వి వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ తో అయినా సినిమా చేస్తే గట్టెక్కుతానని అనుకున్నాడు. కానీ ఆ స్టార్ డైరెక్టర్ కూడా సాయి కి మంచి చెయ్యలేకపోయాడు. అయితే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఒక ప్రేమ కథ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రేమ కథ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాలో కథానాయకుడు సాయి ధరమ్ పాత్ర కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ హీరోయిన్ అనుపమకు వుంటుందట.

మరి కొత్తదనంతో కూడిన కథ కావడంతో సాయి ధరమ్ కూడా ఈ సినిమాని అంగీకరించాడట. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్.... ఏ సినిమా బడితే ఆ సినిమా ఒప్పుకోకుండా... ఆచి తూచి అడుగులు వేస్తూ తన పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి సినిమాలు ఒప్పుకుంటుంది. అందుకే స్టార్ హీరోల సరసన అవకాశం వచ్చినా.. తన పాత్ర ప్రాధన్యత కు ఏమాత్రం భంగం వాటిల్లినా ఆమె ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అనుపమ అనుకున్నట్టుగానే కరుణాకరన్ సినిమాలో అనుపమ పాత్రకు చాలా ప్రాధన్యత ఉండబోతుందట.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరక్కేక్కిన ఫిదా సినిమాలో లో సాయి పల్లవి పాత్రకు ఎంత ప్రాధాన్యతా ఉందొ... ఇప్పుడు కరుణాకరన్ సినిమాలో అనుపమ పాత్రకు అంత ప్రాధన్యత ఉంటుందనే టాక్ వినబడుతుంది. కథ మొత్తం అనుపమ చుట్టూనే తిరుగుతుందట. మరి మాస్ ధోరణిలో హిట్స్ కరువైన తేజు కు ఈ సినిమాలో నటిస్తే కొత్తదనంతో పాటే... వైవిద్యం చూపినట్టుగా ఉంటుందని మారు మాట్లాడకుండా ఈ సినిమాని ఒప్పుకున్నాడట.

Similar News