హిందీ లోనూ బంగారం మెరుగు తగ్గలేదు

Update: 2016-12-15 12:17 GMT

సినిమా ప్రేక్షకులు అందరూ డిఫాల్ట్ గా మణిరత్నం అభిమానులే అని పలువురు ప్రముఖులు అనేక సార్లు మణిరత్నం ప్రతిభ ని ప్రశంసిస్తూనే వున్నారు. అటువంటి మణిరత్నం తీసిన ఆణిముత్యాలను కూడా అవి ఆణిముత్యాలు అని ప్రేక్షకులు గుర్తించని సందర్భాలు అనేకం. ఆలా వరుస పరాజయాలతో విసిగిపోయి తాను అమితంగా ఇష్టపడే ప్రేమ కథ ను రచించి ఓకే కన్మణి పేరుతో తమిళంలో తెరకెక్కించాడు మణిరత్నం. ఈ చిత్రం తెలుగులో ఓకే బంగారం గా విడుదలై భారీ విజయాన్నే అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీ లో ఓకే జాన్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు మణిరత్నం శిష్యుడు షాద్ అలీ.

ఓకే బంగారం కు అత్యద్భుతమైన విజువల్స్ అందించిన ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీ రామ్ ను కాదని దర్శకుడు షాద్ అలీ రవి.కే.చంద్రన్ కి ఛాయాగ్రహణం అవకాశం ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. అప్పట్లో అతడి నిర్ణయాన్ని కొందరు తప్పు పట్టారు కూడా. కానీ ఇటీవల విడుదల ఐన ఓకే జాన్ ట్రైలర్ తో ఆలా తప్పు పట్టిన వారి అభిప్రాయమే తప్పు అని రుజువు అయిపోయింది. సినిమా ప్రముఖులందరూ ఈ ట్రైలర్ ని ట్విట్టర్ లో తెగ పొగిడేస్తున్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ జాబితాలో వున్నారు. రవి.కే.చంద్రన్ సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వుంది అని విజువల్స్ రెఫ్రెషింగ్ గా వున్నాయి అని మెచ్చుకున్నాడు మహేష్.

రానున్న మహేష్ బాబు-కొరటాల శివ చిత్రానికి రవి.కే.చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయనున్నారు. అతని పేరు ప్రకటిస్తున్న నాడే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ 5 సినిమాటోగ్రఫేర్స్ లో రవి.కే.చంద్రన్ కు కచ్చితంగా స్థానం ఉంటుంది అని కొనియాడారు కొరటాల శివ.

Similar News