స్నేహితుడి కి పవన్ నో చెప్పాడా?

Update: 2017-11-20 10:00 GMT

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై లెక్కకు మించి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే... ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిసినెస్ కూడా భారీ స్థాయి లో జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా యూరోప్ లో యాక్షన్ సీక్వెన్స్ ఇంకా రెండు పాటల యొక్క షూట్ ని ఫినిష్ చేసుకుంది. అక్కడ షూటింగ్ పూర్తి కాగానే చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ కి పయనమైంది. అయితే పవన్ మాత్రం అవార్డు అందుకోవడానికి గాను అటునుండి ఆటే లండన్ వెళ్ళడము అవార్డు అందుకోవడం కూడా అజరిగిపోయాయాయి.

అయితే తాజా గా యూరోప్ షెడ్యూల్ యొక్క ఫుటేజ్ ని చూసిన త్రివిక్రమ్.... ఆ సీన్స్‌లో కొన్ని రీ షూట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట. అందులోని కొన్ని సీన్స్ దర్శకుడు త్రివిక్రమ్ కి తృప్తినివ్వకపోవడంవలనే ఆ సీన్స్ ని రీ షూట్ చెయ్యాలని భావిస్తున్నాడట. ఎలాగూ పవన కళ్యాణ్ ప్రస్తుతం లండన్ లోనే ఉన్నాడు కాబట్టి..... మళ్ళి చిత్ర బృందం మొత్తం కలిసి యూరోప్ వెళ్లిఈ సీన్స్ రీ షూట్ చేద్దాం అని ప్రొడ్యూసర్ రాధా కృష్ణ తో చెప్పాడట త్రివిక్రమ్. అయితే దీనికి ప్రొడ్యూసర్ రాధా కృష్ణ కూడా ఓకే చెప్పేడట. మరి ఇప్పటికే తడిసి మోపుడైన బడ్జెట్ మళ్ళీ మరోసారి యూరప్ కి వెళ్లడం అంటే.. మామలు విషయం కాదు. కానీ రాధా కృష్ణ కి త్రివిక్రమ్ - పవన్ మీద ఉన్న నమ్మకమే ఈ సినిమాకి ఎంతైనా పెట్టిస్తుందో.. లేకపోతె నిండా మునిగిన వాడికి చలిముందిలే అనుకున్నాడో.. త్రివిక్రమ్ చెప్పినదానికి ఒకే చెప్పేసాడు.

అయితే నిర్మాత ఒకే అన్నాగాని పవన్ కళ్యాణ్ మాత్రం రీ షూట్ కి నో చెప్పాడు అని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నవంబర్ 25 వరకే ఈ సినిమాకి కేటాయించిన డేట్స్ ని ముగిసి పోతున్నాయి. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పనులు చూసుకుంటాడు. ఒక పక్క ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్న నేపధ్యం లో రీ షూట్ చేస్తేనే మంచిదని భావిస్తున్నారు. కానీ పవన్ మాత్రం ససేమిరా అంటున్నాడట.

Similar News