సినీ విశ్లేషకులపై ఎన్టీఆర్ ఫైర్

Update: 2017-09-26 02:10 GMT

ఎంతో శ్రమించి వ్యయ ప్రయాసలకోర్చి సినిమాలు తీస్తుంటే విశ్లేషణల పేరుతో ఆ చిత్రాలను కిల్ చేసే ప్రక్రియ ఇండస్ట్రీ లో బయల్దేరిందని ఎన్టీఆర్ బరస్ట్ అయ్యారు . జై లవకుశ సక్సెస్ మీట్ సందర్భంగా జూనియర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా నడవనున్నాయి. సినీ ప్రేక్షకులు డాక్టర్లు వంటి వారని, సినిమా అన్నది పేషేంట్ లాంటిదని లోపల చికిత్స జరుగుతుంటే దారిన పోయిన వారు ఇక బతకడు మొన్న ఆ మధ్య ఇలాంటి కేసు ఫెయిల్ అయిందని ఒకరు, మరొకరు మరోరకంగా బంధువుల పాత్రలో వుండే సినీ ఇండస్ట్రీని అధైర్య పరుస్తున్నారంటూ తనదైన శైలిలో చెప్పి ఆకట్టుకున్నారు. ఏ సినిమా ఆడుతుందో ఆడదో డిసైడ్ చేసేది ప్రేక్షకులని వారు డాక్టర్లన్నారు . అలా కాకుండా విశ్లేషకుల పేరుతో దారిన పోయే వారు చెప్పే మాటలు నమ్మొద్దంటున్నారు జూనియర్. ఎన్టీఆర్ చెప్పిన ఈ ఉపమానం మాత్రం సక్సెస్ మీట్ కి వచ్చిన ప్రేక్షకులకు, వేదికమీద వున్న సినీ జనాన్ని బాగా ఆకట్టుకుంది .

Similar News