సందిగ్దంలో పడ్డ దిల్‌రాజు....!

Update: 2016-03-23 16:27 GMT

అల్లుఅర్జున్‌ హీరోగా బోయపాటిశ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ బేనర్‌పై అల్లుఅరవింద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా తన సొంత నిర్మాణ సంస్థ కాబట్టి ఈ చిత్రం ఆడియోవేడుకను అల్లుఅరవింద్‌ భారీగా ప్లాన్‌ చేస్తారని, అందుకు తాము హాజరై సంతోషంగా తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసుకోవచ్చని అభిమానులు ఆశపడ్డారు. కానీ కారణం ఏదైనా సరే ఈ ఆడియోను ఏప్రిల్‌ 1న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేయాలనే నిర్ణయం తీసుకోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ను సినిమా విడుదలకు పదిరోజుల ముందుగా వైజాగ్‌లో జరపనున్నారని తెలియడంతో అభిమానులు ఆ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ ఫంక్షన్‌ కూడా ఆడియో ఫంక్షన్‌ లాంటిదేనని, ఈ చిత్రం యూనిట్‌ మొత్తం ఈ వేడుకకు వస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఫంక్షన్‌ను ఏప్రిల్‌ 10 వ తేదీన జరపడానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అదే రోజు మరో మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'సుప్రీం' ఆడియో వేడుకను జరపాలని, ఆ చిత్రానికి మంచి పబ్లిసిటీ రావడం కోసం మెగాఫ్యామిలీలో అందుబాటులో ఉన్న అందరినీ పిలవాలని దిల్‌రాజు భావించాడు. కానీ 'సరైనోడు' ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ కనుక ఏప్రిల్‌ 10న ఖరారైతే దిల్‌రాజు తన ఆడియో వేడుకను వాయిదా వేసుకోవడం తద్యంగా కనిపిస్తోంది. మరి దిల్‌రాజు ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి....!

Similar News