షాక్ లో ఉన్న అక్కినేని ఫ్యాన్స్!

Update: 2018-03-28 10:00 GMT

రెండు రోజులు క్రితం అఖిల్ మూడో సినిమా ఓపెనింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'తొలిప్రేమ' వంటి సూపర్ హిట్ తీసిన వెంకీ అట్లూరి డైరెక్టర్. అయితే నిన్న నైట్ సడన్ గా రాంగోపాల్‌వర్మ నేను అఖిల్ తో సినిమా తీయబోతున్నాను అన్ని ట్వీట్ చేసాడు. అంతేకాదు ఈ సినిమాకు నాగార్జుననే నిర్మాత అని ప్రకటించాడు.

రాము చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నాగార్జునతో అఖిల్‌ని పోల్చి ఇతనే అందగాడు, మంచి నటుడు అంటూ కితాబిచ్చేసాడు. రాముతో అఖిల్ సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం ఒక షాకింగ్ న్యూస్. అఖిల్ మొదటి సినిమాతో చాలా విమర్శలు ఎదురుకున్నాడు. కానీ రెండో సినిమా హలోతో పర్లేదు అనిపించుకున్నాడు. ఇక వెంకీ అట్లూరి సినిమాతో ఇంకా ఇంప్రూవ్ అవుతాడు అని భావించారు ఫ్యాన్స్. కానీ ఈలోపల రాము సినిమా ప్రకటించాడు. పైగా రాంగోపాల్‌వర్మకు సక్సెస్ రేట్ కూడా సరిగా లేదు. ఇలాంటి టైంలో రాము పేల్చిన బాంబుకి షాక్ లో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.

సక్సెస్ లేని రాముతో నాగ్ సినిమా తీస్తున్నాడంటే అది నాగ్ ధైర్యమే అని చెప్పాలి. మళ్లీ ఇప్పుడు అఖిల్ తో సినిమా అంటేనే కొంచం తట్టుకోలేని విషయం. మరి ఈ అఖిల్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఆఫీసర్‌కి క్రేజ్‌ తీసుకురావడం కోసం వేసిన ఎత్తా లేక నిజంగానే నాగార్జున ఈ బాధ్యతని వర్మకి అప్పగించాడా అనేది తెలీదు.

Similar News