శర్వాతో సాయి పల్లవి?

Update: 2017-11-17 16:00 GMT

శతమానంభవతి, మహానుభావుడు చిత్రాలతో ఈ సంవత్సరం విజయాల్ని అందుకున్న శర్వానంద్ తన తదుపరి చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆ చిత్రం పూర్తి కాగానే శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నాడు. అయితే శర్వానంద్ - హను రాఘవపూడి తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా సాయి పల్లవి ఎన్నికైందని సమాచారం. ‘ఫిదా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి.. ఆ చిత్రంతో తిరుగులేని హిట్ అందుకుని... ప్రస్తుతం నానితో ‘ఎమ్.సి.ఏ’ చిత్రంలో నటిస్తుంది. ఆ చిత్రం డిసెంబర్ చివర్లో విడుదల కానుంది.

లవ్ స్టోరీతో...

ఇక ఈ సంవత్సరం ‘లై’ చిత్రంతో దెబ్బతిన్న హను రాఘవుడి తరువాతి చిత్రంగా తనకు కలిసొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ నే ఎంచుకున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రానికి సంబందించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర బృందం నేపాల్ కు వెళ్లనుందట. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News