విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి విలన్ గా 'సండైకోళి 2'

Update: 2018-05-12 16:45 GMT

తమిళంలో మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో విశాల్ ఒకరు. అయన మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తూ ఉంటాడు. తన సినిమాల్లో కమర్షియల్ పాయింట్స్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంటాడు. లేటెస్ట్ గా ఇతను 'ఇరుంబు తిరై'తో హిట్ కొట్టేశాడు. ఈ సినిమా తర్వాత అయన 'సండైకోళి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

గతంలో విశాల్ ని మాస్ హీరోగా పరిచయం చేసిన చిత్రం 'సండైకోళి'. తెలుగులో 'పందెం కోడి' అనే పేరుతో రిలీజ్ అయ్యి అటు తమిళంతో పాటు.. తెలుగు ప్రేక్షకులని కూడ తెగ ఆకట్టుకుంది. విశాల్ సినిమాలు అంటే మనకి ముందు 'పందెం కోడి' సినిమానే గుర్తు వస్తుంది. అటువంటి ఈ సినిమాకు ఇప్పుడు 'సండైకోళి 2' సీక్వెల్ రానుంది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. గతంలో 'పొగరు' సినిమాలో శ్రియారెడ్డి పాత్రను గుర్తుకు తెచ్చేలా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఉంటుందని అంటున్నారు. గతంలో విశాల్.. వరలక్ష్మి మధ్య ప్రేమాయణం కొనసాగిన విషయం కోలీవుడ్లో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాలు వల్ల వారిద్దరూ విడిపోయారు. మళ్లీ ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Similar News