విడాకుల అనంతరం కూడా కోర్టు కెక్కిన అందాల నటి

Update: 2016-12-04 11:46 GMT

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రంభ. రంభ అతి పిన్న వయసులోనే రంగుల ప్రపంచంలో తారగా వెలిసి విజయ లక్ష్మి నుంచి రంభ గా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి సరసన కూడా నటించిన రంభ ఇక్కడ కెరీర్ ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టటంతో అక్కడ కూడా నటించి ఉత్తరాదిన కూడా తన అందానికి అభిమానులను సంపాదించుకుంది. ఇదే తరుణంలో 2010 లో కెనడా దేశంలో పారిశ్రామికవేత్త ఐన ఇంద్రన్ పద్మనాభం ను వివాహమాడి రంగుల ప్రపంచం నుంచి విరామం తీసుకుంది. వైవాహిక జీవితంలో ఉండగా ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది రంభ. ఇటీవలి కాలంలో తన భర్త తో వచ్చిన మనస్పర్ధలు సర్దుమణగకపోవటంతో విడాకులు మంజూరు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే.

ఇంద్రన్ పద్మనాభం కు 2010 కన్నా ముందే దుశ్యంతి సెల్వ వినాయకం అనే పడతితో వివాహం ఐన సంగతి ఆలస్యంగా రంభ దృష్టికి రావటంతో, పైగా తన భర్త ఆ వివాహాన్ని కప్పి పుచ్చటానికి చేసిన ప్రయత్నాలు తెలియటంతో విసిగిన రంభ న్యాయస్థానం చొరవతో విడాకులు పొందింది. అయితే తన ఇద్దరు ఆడపిల్లల సంరక్షణ భాధ్యతను తనకే అప్పచెప్పాలి అని విన్నపించుకుంటూ మరో సారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది రంభ. ఈ పిటిషన్ పై విచారణ 2017 జనవరి 21 న జరగనుంది.

Similar News