విజయం కోసం పడికాపులు కాస్తున్న చెర్రీ హీరోయిన్

Update: 2016-10-20 05:56 GMT

సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వెండి తెర పరిచయం చిరుత చిత్రంతో జరిగింది. అదే చిత్రంతో తొలిసారి తెర పై మెరిసింది కథానాయిక నేహా శర్మ. చిరుత బాక్స్ ఆఫీస్ దగ్గర మోస్తరు ఫలితాన్ని ఇచ్చింది. తరువాత అడపా దడపా దక్షిణ చిత్రాలతో పాటు, ఉత్తరాది చిత్రాలలోనూ అవకాశాలు వస్తూనే వున్నాయి నేహా శర్మకు. కాకపోతే అమ్మడికి కాలం అసలు కలిసిరావడం లేదు. చేసిన ఏ చిత్రం కూడా గుర్తుండిపోయే విజయాన్ని కానీ, పరిశ్రమలో నిలదొక్కుకునే ధైర్యాన్ని కానీ ఇవ్వలేకపోయాయి.

నేహా శర్మ తెలుగులో ప్రేక్షకుల మెప్పు తోపాటు విమర్శకుల ప్రశంసలూ పొందిన లీడర్ చిత్ర కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన యంగిస్థాన్ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్రం పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేస్తుంది అని ఆశపడింది కానీ అది జరగలేదు. ఇప్పుడు నేహా తుమ్ బిన్2 చిత్రంలో ఇద్దరు కథానాయకుల సరసన నటిస్తుంది. ఈ చిత్రం 2001 లో విడుదలై విజయం సాధించిన తుమ్ బిన్ చిత్రానికి సెక్యూలగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం నేహా శర్మ ఆశలు అన్ని తుమ్ బిన్ 2 మీదే. మరి ఈ చిత్రం ఐన అమ్మడికి తొలి హిట్ ఇస్తుందో లేక విజయమే లేక నేహా నట జీవితంలో దశాబ్ద కాలం పూర్తి చేసుకోవాల్సి వస్తుందో చూడాలి.

2001 లో తుమ్ బిన్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుభవ సిన్హా ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Similar News