వారి మల్టిస్టారర్ పక్కా అంటున్నారు

Update: 2017-09-10 07:22 GMT

నాగార్జున, నాని కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా చాలా కాలం నుండి వార్తలొస్తూనే ఉన్నాయి. అది అధికారికంగా కూడా వినబడింది. అయితే నాని గాని, నాగార్జున గాని ఇంతవరకు ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చెయ్యకపోయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నది అయితే పక్కా అంటున్నారు. అయితే వీరిద్దరూ నటించబోయే మల్టిస్టారర్ చిత్రానికి ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం చెయ్యబోతున్నాడు. ఒక క్రేజీ మల్టిస్టారర్ గా తెరకెక్కేబోతున్న ఈ చిత్రాన్ని శ్రీమాన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే నాగార్జున ప్రస్తుతం చిన్న కొడుకు అఖిల్ 'హలో' సినిమా నిర్మాణంలోనూ, తన సినిమా 'రాజు గారి గది 2 ' లో హీరోగా చేస్తూ బిజీగా ఉండడమే కాక... తన పెద్దకొడుకు నాగ చైతన్య - సమంతల పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నాడు. అలాగే నాని కూడా దిల్ రాజు నిర్మాణంలో 'ఎంసీఏ' లో నటించడమే కాక మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' చిత్రం చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. మరోపక్క మణిరత్నం మల్టీస్టారర్ చిత్రంలో నాని నటించబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైజయంతీ ప్రొడక్షన్స్ అధినేత సి.ఆశినీదత్..... అంతర్వేది ఆలయ దర్శనంకి వెళ్ళిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నాగార్జున, నానీల మల్టీస్టార్ సినిమాని ద్రువీకరించినట్లుగా తెలుస్తుంది.

అలాగే అశ్విని దత్ ఈ మల్టీస్టారర్ చిత్రం శ్రీమాన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకేక్కుతుందని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ మల్టీస్టారర్ చెయ్యబోయే హీరోలు నాగార్జున, నాని లకు ఎప్పుడు ఖాళీ అవుతుందో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అనేది తెలియాల్సి వుంది.

Similar News