వారం పాటు మాయం!!

Update: 2017-10-07 07:00 GMT

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో నటిస్తున్నాడు. ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం గత వేసవిలో సమంత కి వడదెబ్బ తగలడం, అలాగే సుకుమార్ నిర్మించిన దర్శకుడు చిత్రం ప్రమోషన్స్ కోసం రంగస్థలం షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడడం.. అలాగే చరణ్ కూడా తన తండ్రి సైరా సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో కొద్ది రోజులు రంగస్థలాన్ని పక్కనపెట్టినప్పటికీ గత కొన్ని రోజులుగా రంగస్థలం 1985 షూటింగ్ నిర్విరామంగా జరుపుకుంటుంది. ఇప్పటికే హీరోయిన్ సమంతకి సంబందించిన షూటింగ్ పూర్తవడంతో సమంత తన పెళ్లికోసం గోవా వెళ్ళిపోయింది.

స్ట్రెస్ తగ్గించుకోవడానికి.....

ఇక తర్వాత కూడా చరణ్ మీద కొన్ని సన్నివేశాలు నిర్విరామంగా తెరకెక్కించడంతో... రోజులు తరబడి షూటింగ్ తో హీరో రామ్ చరణ్ బాగా అలిసిపోవడంతో ఇప్పుడు ఒక వారం రోజులపాటు షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని హాయిగా సేదతీరబోతున్నాడట. ఇప్పటికే కోయంబత్తూరులో అడుగుపెట్టిన రామ్ చరణ్ అక్కడినుండి కేరళకు ప్రయాణమవుతున్నాడు. కోయంబత్తూరులో చరణ్ అక్కడ సద్గురు ఈషా ఫౌండేషన్ సెంటర్ లో కొంతసమయం గడిపాడు. ఈ సద్గురు ఎవరంటే... ఇటీవల హైదరాబాద్ లో రామ్ చరణ్ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు చేశారు.

కేరళలో నేచర్ క్యూర్ సెంటర్లో.....

అయితే కోయంబత్తూర్ నుండి చరణ్ కేరళకు వెళ్లి అక్కడ ఒక నేచర్ క్యూర్ సెంటర్ లో సేద దీరనున్నాడని చరణ్ సన్నిహితవర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక రామ్ చరణ్ తోపాటు రంగస్థలం యూనిట్ సభ్యులు కూడా కొంతమంది ఆ నేచర్ క్యూర్ సెంటర్ కి వెళుతున్నట్టుగా చెబుతున్నారు. ఇక చరణ్ రెస్ట్ పూర్తికాగానే రంగస్థలం మిగతా షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నాడు సుకుమార్..

Similar News