రీమేక్ సినిమాలో షాలినీ పాండే!!

Update: 2018-02-24 15:00 GMT

హీరో నిఖిల్ చాలా కాలం తర్వాత కన్నడ రీమేక్ మూవీ 'కిరాక్ పార్టీ' సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కన్నడంలో సూపర్ హిట్ అయింది. మార్చిలో రిలీజ్ కు రెడీ అవుతుంది. 'కిరాక్ పార్టీ' తర్వాత నిఖిల్ మళ్లీ రీమేక్ చేయనున్నాడు. ఈసారి తమిళ్ లో హిట్టయిన 'కణితన్' మూవీ తెలుగులో రీమేక్ చేయనున్నాడు హీరో నిఖిల్.

ఆమె పేరు అనౌన్స్ చేస్తారనుకుంటే...

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 'హలో' సినిమాతో తెలుగులో పరిచయం అయిన మలయాళీ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్ ను హీరోయిన్ గా చేస్తోందని మాట వినిపించింది. ఆమె పేరు అఫిషియల్ గా అనౌన్స్ చేయడమే అనుకున్న తరుణంలో తెరపైకి ఇంకో హీరోయిన్ పేరు వచ్చింది. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అందరి హృదయాలు గెలుచుకున్న హీరోయిన్ షాలినీ పాండే తీసుకోవాలనుకుంటున్నారనేది లేటెస్ట్ న్యూస్.

స్టోరీ నచ్చేసింది.....

డైరెక్టర్ టి.ఎన్.సంతోష్ ఇప్పటికే ఈ సినిమా స్టోరీను షాలినీకి చెప్పాడంట. షాలినీకి కూడా స్టోరీ నచ్చిందంట. త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ లో ఒక్కరు చెప్పారు. ప్రస్తుతం షాలినీ తెలుగులో హిట్టయిన '100 % లవ్' తమిళ వెర్షన్ లో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. అలానే మహానటి సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు అయ్యాక నిఖిల్ సినిమాలో చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Similar News